విద్యార్తులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్త్మెంట్స్ సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి)
విద్యార్తులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్త్మెంట్స్ తోపాటు మౌలిక సదుపాయాలు పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీ డీ ఎస్ యూ ఎస్ఎఫ్ఐ విద్యాసంస్థలు బందుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బుధవారం పి డి ఎస్ యూ అధ్యక్షుడు సురేష్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రాజేష్ జహీరాబాద్ పట్టణంలోని పాఠశాలలు కళాశాలలో బంద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ. ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు క్లాస్మేటిక్ చార్జీలు పెంచాలన్నారు. గత నెల రోజులు గడిచిన ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫామ్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల పట్ల చొరవ తీసుకొని వెంటనే యూనిఫామ్స్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలన్నారు.పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఏపి 2020 ని రద్దు చేయాలి. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక సదుపాయాలు టీచర్ పోస్టులు భర్తీ చేయాలి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేనియెడల విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. పి డి ఎస్ యు డివిజన్ నాయకులు అఖిల్, వంశీ, జి ప్రశాంత్, ప్రవీణ్, ప్రదీప్, తుకారం రవి, దిలీప్ ,నవీన్ ప్రభు ,నరేష్ , ఎస్,ఎఫ్,ఐ డివిజన్ రాజేష్, హరీష్, మల్లేష్ ,చంద్రవర్దన్, అథీక్ ,పాషా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.