విద్యార్థి మొక్కలు నాటండి వాటిని పెంచే బాధ్యత తీసుకోండి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 29::  విద్యార్థి దశ నుండి ప్రతి విద్యార్థి సంవత్సరానికి కనీసం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గౌతు జి  గూడ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రేణు కుమారులు పేర్కొన్నారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు గౌతోజిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరస్వామి  ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ ల తో కలసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఉపాద్యాయురాలు సుజాత. సెక్రెటరీ రమాదేవి ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ మమత రెడ్డి.అంగన్వాడీ టీచర్ కవిత, వార్డు సభ్యులు అంజనేయులు పెంటమ్మా భవాని శ్రీనివాస్. పద్మ నాయకులు పొగాకు నర్సింలు విద్యార్థులు పాల్గొన్నారు