విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌

` కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ రెండో సమావేశం నిర్వహించి వివిధ వర్గాల ప్రతినిధులపై చర్చించింది. సమావేశం అనంతరం టిపిసిసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ డి.శ్రీధర్‌ బాబు విూడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి సలహాలు, వినతులు స్వీకరించేందుకు అక్టోబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో కార్మిక సంఘాలు, బిసి సంఘాలు, మాజీ సైనికోద్యోగుల సంఘాలు తమ వినతులను మహాకూటమికి సమర్పించాయి. ఆటో డ్రైవర్లకు మేలు చేసే సంక్షేమ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, టిపిసిసి వ్యూహ కమిటీ తన మూడవ సమావేశాన్ని నిర్వహించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహాలకు రూపకల్పన చేసింది.