విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు

మక్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) నర్వ మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్, SMC చైర్మన్ R.అయ్యన్న అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుల్లో రాణించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు కుంటున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం దుస్తులను, పాఠ్య పుస్తకాలు, అందజేస్తుందన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఏకరూప దుస్తులను ధరించి పాఠశాలకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లేష్, SMC చైర్మన్ R.అయ్యన్న ఉపాధ్యాయులు లక్ష్మన్న, నాగలక్ష్మి, రాజేష్, రాణి, కురుమూర్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.