విద్యార్థులకు దుస్తులు పంపిణీ

మల్దకల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థిల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పద్మమ్మ, గోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తుందన్నారు.ప్రతి సంవత్సరము ప్రతి విద్యార్థికి దుస్తులను పంపించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకమ్మ,ఉపాధ్యాయులు ఉషారాణి ,అనిత,శోభారాణి, సుష్మ, ప్రసన్నకుమార్,పీఈటి వెంకటరాములు,వీరన్న తదితరులు పాల్గొన్నారు.