విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ…
చేవెళ్ల ఆగస్టు 17 (జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు తెలుగు కృష్ణమోహన్ ముదిరాజ్ జన్మదిన సందర్భంగా పామేన గ్రామ ప్రాథమిక పాఠశాలలో నోట్ బుక్స్ పెన్ పెన్సిల్స్, షాప్నర్స్, రబ్బర్ర్స్ పంపిణీ చేశారు అలాగే పిల్లలకి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి పౌరులు అని మంచి చదువు చదివి ఉన్నతంగా ఎదగాలని అన్నారు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ సార్ గారికి చైర్మన్ బాలరాజు గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ మధ్య కాలంలో స్కూల్ మరమ్మత్తులు చేపించిన ఎంపీటీసీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి పామెన గ్రామ బిజెపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి, పోతుగంటి నర్సింలు, జీ రమేష్, మరియు బిజెపి బిజెవైఎం నాయకులు బూతు కమిటీ అధ్యక్షులు విజయ్ ప్రధాన కార్యదర్శి గణేష్ జీ పాండు రామకృష్ణ రామ్ రెడ్డి సిహెచ్ రమేష్ బి అనిల్ కుమార్ అంగన్వాడి టీచర్ అరుంధ గారు పాల్గొన్నారు