విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా నాన్న కన్నం బొందయ్య చనిపోవడంతో జ్ఞాపకంగా, అలాగే మా అత్తమ్మ రామగిరి నంబమ్మ చనిపోయిందని నంబమ్మ జ్ఞాపకంగా ప్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని సర్పంచ్ అన్నారు. నాలుగు సంవత్సరాలుగా స్కూల్ విద్యార్ధులకు అరటి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని సర్పంచ్ అన్నారు. ఈకార్యక్రమంలో సుందిల్ల, ముస్త్యాల విద్యార్థులు సుమారు 400 నాలుగు వందల మంది విద్యార్ధులకు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుందిల్ల ముస్త్యాల స్కూల్ హెచ్ ఎం లు టీచర్స్ పాల్గొన్నారు.