విద్యుత్‌ సంక్షోభం పై భాజపా సదస్సు

హైదరబాద్‌:విద్యుత్‌ సంక్షోభం పై ఈనెల 23న భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు గుజరాత్‌ విద్యుత్‌శాఖ మంత్రి సౌరభ్‌భాయ్‌ పటేల్‌ హజరవుతారని అక్కడ రైతులు, పరిశ్రమలకు విద్యుత్‌ను సరఫర ఎలా చేయగలుగుతున్నారో వివరిస్తారని తెలిపారు.