విద్యుత్ షాక్ తో రైతు ఈశ్వరయ్య మృతి.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు శుక్రవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. గ్రామానికి చెందిన ధర్నమోనీ ఈశ్వరయ్య (50) అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరి పంట వేయడాని పొలాన్ని సిద్దం చేసేందుకు కరిగెట చేయడానికి పొలంలోని మడులను నీటితో నింపడానికి బావి వద్ద ఉన్న కరెంటు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు.అతనికి భార్య,కుమారుడు,కమార్తె ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై రోదించారు.ఈశ్వరయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.