విద్య సంస్థల బంద్ విజయవంతం

మల్దకల్ జూలై 20 (జనంసాక్షి) విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు,జూనియర్‌ కాలేజీల బంద్‌కు పీడీఎస్‌యూ,ఎస్‌ఎఫ్‌ఐ,పీడీఎస్‌యూ,ఏఐఎస్‌ఎఫ్‌,ఏఐడీఎస్‌వో,వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి చాంద్ పాషా,జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలేష్ మాట్లాడుతూమల్దకల్ మండలంలోని పలు పాఠశాలలు కళాశాలల బంద్‌ను నిర్వహించారు.
నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ-2020) రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను అందించాలనివిద్యార్థులందరికీ సకాలంలో యూనిఫామ్ ఇవ్వాలన్నారు.మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి,పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,ఎంఈవో, డిప్యూటీఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను అరికట్టాలనీ,నియంత్రించేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు.జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,వాటిలో మౌలిక వసతులు మెరుగుపర్చి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌కు ప్రవేట్ పాఠశాలలు,జూనియర్ కళాశాలల యాజమాన్యం సంపూర్ణ మద్దతు ప్రకటించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బంద్ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కమిటీ సభ్యులు సురేందర్ గౌడ్,తిరుమలేష్,బి.తిరుమలేష్,శివ,పరుశరాముడు తదితరులు పాల్గొన్నారు.