విధులు- బాధ్యతలు” జాబ్ జార్జ్ ఇవ్వాలని విఆర్ఓ ల ధర్నా..

-జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి సెక్షన్ సుపరిడెంట్ మదుసూదన్ చారి, ఆర్డిఓ రాములు లకు వినతిపత్రం అందజేసిన  విఆర్ఓ లు…
  గద్వాల రూరల్ జులై 07 (జనంసాక్షి):-  విఆర్ఓ లకు  స్పష్టమైన “వీధులు బాధ్యత” (జాబ్ చార్ట్) ఇవ్వాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ లేకపోవడంతో డి సెక్షన్ సూపరిడెంట్ మదుసూదన్ చారి మరియు ఆర్డిఓ రాములు లకు జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న విఆర్ఓ లు వివిధ డిమాండ్ లతో  వినతిపత్రం అందజేసినారు…ఈ సందర్భంగా విఆర్ఓ లు మాట్లాడుతూ విఆర్ఓ లను రి లోకేట్ చేయాలని,ఆకాల మరణం చెందిన విఆర్ఓ ల‌ కుటుంబాలలో కారుణ్య నియమాలు చేయాలని, అర్హత కలిగిన విఆర్ఓ లకు పదోన్నతి కల్పించాలని, సర్వీసు రెగ్యులరైజ్,6,12,18 సంవత్సరాల ఇంక్రిమెంట్ల తదితర డిమాండ్ లతో జిల్లాలోని మండలాల విఆర్ఓ లు గట్టు, కేటిదొడ్డి, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, అయిజ,గద్వాల, ధరూర్, ఇటిక్యాల,మనవపాడ్,ఉండవల్లి, అలంపూర్ మండలాలలో పని చేసే విఆర్ఓ లు తమ డిమాండ్ ల వినతిపత్రాలు సమర్పించారు… ఈ కార్యక్రమంలో ఆయా మండలాల విఆర్ఓ లు పాల్గొన్నారు..