విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవు

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్
జనంసాక్షి/రేగోడ్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.ఈ సందర్భంగా గురువారం నాడు రేగోడ్ మండలంలోని జగిర్యాల,రేగోడ్,కొత్వాన్పల్లి గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆకస్మికంగా నర్సరీ,ఫిట్టింగ్,ప్లాంటేషన్,మొక్కల సంరక్షణ,శానిటేషన్ వంటివాటిపై పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు టార్గెట్ ఇచ్చిన మేరకు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని పెండింగ్లో ఉంచకూడదని ఆమె అన్నారు.అలాగే జగిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించి ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున ప్రజలకు వైరల్ ఫీవర్,జలుబు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి.కావున ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Attachments area