వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి…
—-ఎస్ఐ తాజుద్దీన్
వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండలంలోని అన్ని గ్రామాలలోని భక్తులు వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఎస్ఐ తాజుద్దీన్ మండల ప్రజలను కోరారు .ఈ సందర్భంగా పలు సూచనలను చేశారు. జరుగు తున్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీలకు వివిధ గ్రామాలాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించ దలచిన వారు ముందస్తుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. వివరాలు తెలుపుతూ మండపాల వద్ద ఏదైనా సమస్య తలెత్తినచో కమిటీ వారిదే పూర్తి బాధ్యత అని గుర్తించాలి, పంచాయతీ వారి అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి, విద్యుత్ కలెక్షన్ల నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతి తప్పని సరిగా పొందాలి.గ్రామాలలో వివిధ కూడల్ల వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీస్ వారికి తప్పని సరిగా తెలియ జేయాలి.మైకులు ఏర్పాటుకు మీసేవ ,పోలీసు వారి అనుమతి తప్పని సరిగా ఉండాలి.డిజె సౌండ్ అనుమతి లేదు అదే విధముగా గణేష్ మండపాల వద్ద రోడ్లు బ్లాక్ కావటం అంత రాయం ఏర్పడ కుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి.ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లు లేకుండా గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవాలని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను కోరారు.
