వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 25:: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ పేర్కొన్నారు శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క వర్గాన్ని రెచ్చగొట్టకుండా చేయవద్దని చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు అన్ని మతాలవారు వారి తమ పండుగలను శాంతియుతంగానే జరుపుకుంటున్నారని తెలుపుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు డీజే లకు అనుమతి లేదని వినాయక మండపాల వద్ద 24 గంటలు నిర్వాహకులు కాపలా ఉండాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల ప్రజలు పాల్గొన్నారు