విభజన హామీలపై బిజెపి నాయకులు గొంతు విప్పాలి.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.
సిరిసిల్లలో మూడో రోజు కొనసాగిన పాదయాత్ర.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 11(జనం సాక్షి) కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఈ విషయంలో గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిరిసిల్లలో మూడవరోజు పాదయాత్ర సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ. చరిత్రను తప్పుదోవ పట్టించేందుకుచేస్తున్న కుట్రలను ప్రజల అర్థంచేసుకోవాలనీ కోరారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపి నైతిక హక్కు గాడ్సే భక్తులకు ఎక్కడిదని ప్రశ్నించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందు చూపుతో బ్యాంకుల జాతీయకరణతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేసిందని అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీల కోసం తప్ప ప్రజల కోసం పనిచేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఎంతసేపు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మహాలక్ష్మి టెంపుల్ చుట్టూ తిరుగుతున్న ఎంపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. విభజన హామీలపై యువకురోజైనా గొంతు విట్టారని సూటిగా ప్రశ్నించారు. స్థానిక ఎంపీగా సిరిసిల్ల పరిశ్రమ కోసం ఏం చేశారో చెప్పాలని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం స్థానిక సాధన సభ్యులు మంత్రి కేటీఆర్ టూరిస్ట్ గా వచ్చి పోవడమే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. పెద్దపెద్ద భవనాలు నిర్మించిన కేటీఆర్ అనుచర్ల జేబులు నింపేందుకే నని పాదయాత్రలో ప్రజలు తమకు తెలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదామని అన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ పాడూరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు