విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్స్ విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో గల విశ్రాంత ఉద్యోగస్తుల భవనము రాధాకృష్ణ సదన్ లో నాగర్ కర్నూల్ జిల్లా శాఖ అధ్యక్షులు జె.రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్ శాఖ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మూడు సంవత్సరముల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జె.రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ మరియు హెడ్ క్వార్టర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చక్కగా పనిచేస్తుందని సంఘ సభ్యులు చైతన్యవంతులుగా ఉండి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని రాబోవు మూడు సంవత్సరాల కాలంలో కూడా నూతన కార్యవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఇదేవిధంగా పనిచేసి సంఘ సభ్యులకు అవసరమైన సేవలు అందిస్తూ సమాజానికి సేవ చేయాలని తెలిపారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది