వి ఆర్ ఏ లు శాంతినగర్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 10 (జనం సాక్షి);
వీఆర్ఏ ల జేఏసీ పిలుపుమేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ తహసిల్దార్ ఆఫీస్ ను స్థానిక వీఆర్ఏ ముట్టడించారు.నిరవధిక సమ్మెలో భాగంగా 78వ రోజు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం ముట్టడించాలని తమ జేఏసీ నాయకుల పిలుపుమేరకు తహసిల్దార్ ఆఫీస్ ను ముట్టడించినట్లు, స్వయాన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, మా కోరికలు తీరేదాకా ఉద్యమం ఆపమని ఇంకా ఉదృతం చేస్తామని, ముట్టడిలో భాగంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు మద్దతు తెలిపినట్టు వీఆర్ఏలు అన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మన్న తో పాటు మండల అధ్యక్షుడు ఈశ్వర్,వీఆర్ఏలు పాండు,మమత,విజయుడు, నాగమణి, సవరమ్మ, ఖాజా హుస్సేన్,బడే సాబ్ వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.