వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ బజార్ హత్నూర్ మండల అధ్యక్షులు సామన్ పేల్లి శేఖర్ డిమాండ్ చేశారు మండలంలో వీఆర్ఏలు చేస్తున్న దీక్షాలో భాగంగా మండలంలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం పెన్షన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు చివరి వరకు వీఆర్ఏలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉద్దవ్ బొమ్మత్త నరసయ్య రవి గణేష్ కానిందే దినేష్ పురుషోత్తం మారుతి పాల్గొన్నారు