వీఆర్ఏలు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చిన నేషనల్  హ్యూమన్ రైట్స్ 

నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి)

మంగళవారం రోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని నగల్ గిద్దమండలం లో విఆర్ ఏ లు చేస్తున్న సమ్మెకు మద్దతు తెల్పిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహిమ్.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలి వీఆర్ఏల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు రహీమ్ ప్రధాన కార్యదర్శి వై పండరీ సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలకు దిగిన నాగల్గిద్ద మండలం వీఆర్ఏలకు దీక్ష చేస్తున్న సంఘీభావంగా మద్దతు పలికిన జాతీయ మానవ హక్కుల  సంఘం జిల్లా  అధ్యక్షులు రహీమ్,జిల్లా ప్రధాన కార్యదర్శి వై పండరీలు  మద్దతు పలికారు, ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్ 09న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలు అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మరియు 55 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వారి కుటుంబంలో ఒకరికి యధావిధిగా ఉద్యోగంలో ఇవ్వాలని అన్నారు, ఉద్యోగం చేసుకుంటూ ప్రమాదశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు, వారు చేస్తున్న దీక్షలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ డివిజన్ అధ్యక్షుడు జమీర్,నాయకులు శాంతప్ప, వీఆర్ఏలు మల్లప్ప,ఇబ్రహీం సాబ్,  రమేష్, ఇస్మాయిల్ , నయుమ్, షేకప్ప,మారుతి తదితరులు పాల్గొన్నారు.