వీఆర్ఏల పే స్కేల్ జీవో విడుదల చేయాలని రాస్తారోకో

కొత్తగూడ అక్టోబర్ 8 జనం సాక్షి: వీఆర్ఏల  నిరవధిక సమ్మె 76 వ రోజుకు చేరుకుంది.రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగింది. వీఆర్ఏల మండల  జాక్ చైర్మన్ చెన్నూరు రవి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో చేయడం జరిగింది.గత 3 నెలల నుండి జీతాలు లేక అర్ధాకలితో కుటుంబ పోషణ భారంగా మారి రోడ్డుమీద పడడం జరిగింది.పిల్లల చదువులు కుంటూ పడ్డాయి.మా కుటుంబాలు అనారోగ్య స్థితిలో ఉన్నాయి.చర్చలకని పిలిచి కాలయాపన చేయడం వలన మా కుటుంబాలు చాలా దినస్థితిలో ఉన్నాయని అన్నారు.చర్చలు ఫలించకపోవడం వలన ఈరోజు రోడ్డుపైకి వచ్చి రాస్తారో చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరసయ్య ప్రధాన కార్యదర్శి అల్లం సాంబయ్య కోశాధికారి చెన్నూరు సురేష్ దుర్గం రవీందర్  సత్యనారాయణ కళావతి నంగయ్య జోగా సమ్మక్క చెన్నూరు సమ్మక్క నీలం వెంకటేశ్వర్లు మొదలైన వారు పాల్గొన్నారు.