వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
ఝరాసంగం జులై (జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల నాయకులు చంద్రన్న డిమాండ్ చేశారు. సోమవారం ఝరాసంగం లోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు.సమ్మె కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు విధుల్లోకి వెళ్లేది లేదని హెచ్చరించారు. గ్రామ సేవకులుగా ఎన్నో సేవలందిస్తున్నా ప్రభుత్వం తమ వృత్తిని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నర్సిములు, దత్తు,సాయిలు, నర్సిములు, లాలప్ప, సుజాత, సంగన్న, మణేయ్య తదితరులు పాల్గొన్నారు.
