వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

జహీరాబాద్ జులై 27 (జనంసాక్షి)వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ మహిపాల్, విఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. బుధవారం ఝరాసంగం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న విఆర్ఏల దీక్ష కు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమంటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని అన్నారు. తక్షణమే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అడుగుతున్నది సీఎం హామీలు పేస్కెల్,55సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్స్ మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్, దత్తు,నర్సింహులు,మానయ్య,తదితరులు ఉన్నారు.