వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం పలికిన రాయికోడ్ మండల బిజెపి అధ్యక్షుడు
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12 రాయికోడ్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు గత 19 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా రాయికోడ్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు సతీష్ పాటిల్ కమిటీ నాయకులతో కలిసి మండల వీఆర్ఏలకు సంఘీభావం పలికారు.ఈ మేరకు శుక్రవారం బీజేపీ పార్టీ తరపున వారి సమ్మె శిబిరానికి వెళ్లి 75వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా ఆయన చేతుల మీదుగా జాతీయ జెండాలను అందించి అక్కడ ఏర్పాటు చేసిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని వీఆర్ఏలకు సంపూర్ణ మద్దతును తెలిపారు. అనంతరం మహిళ వీఆర్ఏలు సమ్మె శిబిరం వద్ద మండల బీజేపీ పార్టీ అధ్యక్షునికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సతీష్ పాటిల్ మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వీఆర్ఏలు నేడు రక్షాబంధన్ పండుగను కూడా కుటుంబసభ్యులతో గడపకుండా ఈ సమ్మెను నిర్వహించడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్ర స్థాయిలో నిరవధిక సమ్మెలు జరుగుతుండడం సిగ్గుచేటన్నారు. మండలంలో చాలా మంది వీఆర్ఏలు ఉన్నారని వారందరు నిరవధిక సమ్మెలు చేపట్టడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వం తూతుమంత్రంగా మాటలు చెప్పి వారిని మభ్యపెట్టి వెట్టిచాకిరి చేపించుకుంటున్నటువంటి ప్రభుత్వం వీఆర్ఏ జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని హెచ్చరించారు. గత 23 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పేస్కేల్ అమలు జరిపి వేతనాలను నిర్ణయిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చినప్పటికీ దాన్ని ఇంత వరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందొ ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే లకు జీతాలు పెంచిన ప్రభుత్వం వెంటనే విఆర్ ఏలకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని అర్హులైన గ్రామ సేవకులకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైన రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏల పట్ల కళ్ళు తెరిచి చూడాలని అన్నారు. లేని యెడల మండల బిజెపి పార్టీ కమిటీ జిల్లాస్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్లాడానికి వెనుకడబోమని అలాగే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మద్దతు తెలిపిన వారిలో రాయికోడ్ మండల బీజేపీ కమిటీ అధ్యక్షుడు సతీష్ పాటిల్, తుకరం, రాజు, లక్ష్మణ్, మల్లేశం, వెంకట్, వీరన్న పాటిల్, వినోద్ పాటిల్, అంజిరెడ్డి, తుకరం, వీరెశం, ఉమేష్, అమృత్ తదితరులు ఉన్నారు.
