వీఆర్ఏ ఆత్మకు శాంతి కోసం మౌనం పాటించిన విఅర్ ఏ లు

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి)వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాంరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు కావలి అన్నమయ్య ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగిందని ఆయన కుటుంబానికి తీరనిలోటు అన్నారు. వీఆర్ఏలందరికీ చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వీఆర్ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ నాగరాజ్ ఆధ్వర్యంలో రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండలం.మండల అధ్యక్షులు జైపాల్ వి అర్ ఏ లు పాల్గొన్నారు.