వీఆర్వో భర్తకు ఆర్థిక సాయం అందించిన తాసిల్దార్ రాజు నాయక్

జనం సాక్షి, వంగూర్:
వంగూరు మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్న జంపుల భార్గవి వయసు 32 గత కొంతకాలంగా నిమోనియా వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించడం జరిగింది. భార్గవి కుటుంబ సభ్యులకు తాసిల్దార్ రాజు నాయక్ సిబ్బందితో వెళ్లి పదివేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వచ్చేటట్లు తన వంతు కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వీఆర్వోలు తదితరులు ఉన్నారు.