వీకే సింగ్ వివాదాస్పద ట్వీట్!

j0ujztxpకేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన ట్వీట్ వివాదం రేపుతోంది. పాకిస్థాన్ నేషనల్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఆ కార్యక్రమం అసహ్యంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. వీకే సింగ్‌ ట్వీట్‌పై కాంగ్రెస్‌ విమర్శలకు దిగింది. పాకిస్థాన్ కార్యక్రమాలకు హాజరవడం వీకే సింగ్‌కు ఇష్టం లేకపోతే.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత మనీష్ తివారీ ఘాటుగా స్పందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా స్వతంత్ర హోదాలో పని చేస్తున్న వీకే సింగ్ పాకిస్థాన నేషనల్ డే కు హాజరైన.. ఆ కార్యక్రమం అసహ్యంగా ఉంది. అయినా విధినిర్వహణలో భాగంగా ఇలాంటివి తప్పవు అని ట్వీట్ చేశారు. ఇదే కార్యక్రమానికి వేర్పాటు వాద నాయకులను కూడా ఆహ్వానించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను కార్యక్రమానికి వెళ్లినందుకు అసహ్యంగా ఉందని ట్వీట్ చేయలేదని, ఒక వర్గం మీడియా పని గట్టుకొని విష ప్రచారం చేయడం అసహ్యంగా ఉందనే భావంతో ట్వీట్ చేశానని వీకే సింగ్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ మాత్రం వీకే సింగ్ వివరణతో శాంతించడం లేదు.