వెంకటాపూర్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు

: జులై . (జనం సాక్షి) :
మండలంలోని వెంకటాపూర్  గ్రామంలోని కుమ్మరి వాడలో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రభుత్వ సహకారంతో  క్రీడా ప్రాంగణాన్ని  ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎక్ససైజ్ బార్లు, వాలీబాల్ కోర్టు, కోకో ఫోల్స్ను  బిగించారు. అదేవిధంగా గ్రామంలోని పాఠశాలలో కబడ్డీ, లాంగ్ జంప్ కు సంబంధించిన వివిధ కార్యక్రమాలనూ పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు గురువారం పనులను పరిశీలించారు. గ్రామంలోని విద్యార్థులు, క్రీడాకారులు వీటిని వినియోగించుకొని క్రీడల్లో ఆరితేరాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజు, టీఏ మమత, ఈసీ సుజాత, పంచాయతీ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.  క్రీడా ప్రాంగణంలో పనులను పరిశీలిస్తున్న అధికారులు