వెనుకబడిన వర్గాల పక్షాన పోరాడిన గొప్ప వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్……

*గండ్ర సత్యనారాయణ రావు…..
టేకుమట్ల.ఆగస్టు18(జనంసాక్షి)మూడు వందల ఏండ్ల క్రితం వెనుకబడిన వర్గాల పక్షాన పోరాడిన గొప్ప వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
సర్వాయి పాపన్న మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదురించి నిలిచిన ధీరుడని అన్నారు.భూస్వామ్యులు, పెత్తందారులను ఎదురించి, బడుగు బలహీనర్గాలకు అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి కీర్తి ప్రతిష్టల గూర్చి నేటి తరం సమాజానికి తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్ని సమసమాజ స్థాపనకు అందరం కలిసి కృషి చేయాలని అన్నారు. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు,జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదని ఈ సందర్భంగా జీఎస్సార్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్,చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పాణి,టేకుమట్ల మాజీ సర్పంచ్ పెరుమాండ్ల లింగయ్య గౌడ్,మాజీ ఎంపీటీసీ తోడేటి కుమార్,మండల నాయకులు చిరంజీవి గౌడ్,గుర్రపు దయాకర్ గౌడ్,బూపెల్లి రవీందర్,పెరుమాండ్ల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగ మధుకర్,రెడ్డి రాజుల రాజు,పెసర విగ్నేష్ గౌడ్,బోండ్ల మహేష్,కౌడగాని అనిల్, తదితరులు పాల్గొన్నారు.