వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

 జనం సాక్షి: నర్సంపేట
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదమూడు వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో వైఎస్సార్ స్మారక గార్డెన్ లొ వైఎస్సార్ కాంస్య విగ్రహానికి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ వరంగల్ ,హన్మకొండ జిల్లాల అధ్యక్షులు నాడే౦ శాంతికుమార్ శుక్రవారంపూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, హమాలీ కార్మికులకు పండ్లు పంపిణీచేసినారు. అనంతరం పూల మొక్కలు నాటినారు
ఈ సందర్బంగా శాంతి కుమార్ మాట్లాడుతూ   ఆనాడు దివంగత మహా నేత రాజశేఖరరెడ్డి పరిపాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిన మహానేత గుర్తులు  తెలంగాణ రాష్ట్రంలో నెర్రెలు బరిన భూముల్లో నీళ్లు ను పారించాలని రైతులు పంటలు పండించుకోవాలని ఆలోచన చేసి ముప్పై ఆరు సాగునీటి ప్రాజెక్టులకు స్వీకారం ..అది వైఎస్సాఆర్ చలవే ,,ఉచిత విద్యుత్ జీవోపై తొలి సంతకం చేసి అన్ని విధాల చితికిపోయిన ఉన్న రైతాంగానికి తక్షణ జీవన శక్తిని అందించారు.  పూర్తి గా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయాన్ని  మళ్లీ పట్టాలెక్కించి , దాని పునరు జీవనానికి బాటలు పరిచారు   ఆరోగ్యశ్రీని భూమార్గం పట్టించింది  నీరు పేదలకు సైతం ఖరీదైన కార్పొరేట్ వైద్యం దక్కేలా చేశారు  ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తో నిరు పేదవర్గాల పిల్లలకు సైతం ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు  అదో గదిలో ఉన్న సహకార వ్యవస్థను ఆదుకున్నారు  గ్రామాల్లో పల్లెల్లో మళ్లీ కళకళలాడేలా చేశారు .
  వైఎస్సార్ మరణం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక  రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించలేకపోవడం వల్ల
పేద ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు  రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు  అందుకే రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తిరిగి ప్రజలకు అందించేందుకు రాజశేఖర్ రెడ్డి  కూతురు వైఎస్ షర్మిల గారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి ప్రజలకు ఏ మేరకు అవసరాలున్నాయో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునేందుకు పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పదిహేడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి  ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ ముందుకు పోతున్న షర్మిల ను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం . ఈ
కార్యక్రమంలో  నర్సంపేట మండల అధ్యక్షుడు నూనె నర్సయ్య,  నర్సంపేట నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ జిల్లేపల్లి దినేష్,  జిల్లా నాయకులు గీరగాని చంద్రమౌళి ,పట్టణ అధ్యక్షులు కిసారి రాంబాబు,
నాడే౦ రామక్రిష్ణ , మహిళా నాయకురాలు ఎస్కె ఖాజాబీ, శివ ,ధన్ రాజ్ ,రాజేందర్ శ్రీనివాస్ ,రమేష్ ప్రజలు ,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.