వ్యక్తి దారుణ హత్య.. నరికి చంపిన దుండగులు

మల్దకల్ అక్టోబర్ 8(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో బోయనడిపి నల్లన్న (48) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో నల్లన్న పశువుల గుడిసెదగ్గర నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దారుణంగా గొడ్డలితో నరికి చంపివెళ్లారు.శనివారం ఉదయం నల్లన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ కుమారులు గుడిసెదగ్గరికి వచ్చి పశువులకు దానగా పెట్టడానికి వచ్చారు.తండ్రి పై ఉన్న దుప్పటి తీసి వేయగా  రక్తపు మడుగులో ఉన్న తండ్రినిచూసికుమారులు  భయపడిఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కుటుంబ సభ్యులు వెంటనే చూడగా గొడ్డలితో నరకడం వల్ల దారుణ హత్యకు గురై పడి ఉండడాన్ని గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గద్వాల సీఐ చంద్రశేఖర్ ,ఎస్సై ఆర్ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.హత్యకు గల కారణాలు తేలకపోవడంతో క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలను సేకరించారు.భూ తగాదాలు,ఆర్థిక లావాదేవీల వల్ల హత్య జరిగిందా…? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.మధ్యాహ్నం డాగ్ స్క్వాడ్ పరిసర ప్రాంతాల్లో తిరిగింది.శవాన్ని పోస్టుమార్టం   నిమిత్తం గద్వాల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.నిందితులను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.మృతునికి ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నారు.