వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

టేకులపల్లి,నవంబర్ 11( జనం సాక్షి): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గా కడుదుల వీరన్న, అధ్యక్షుడిగా పూనెం స్వామిలను శుక్రవారం జరిగిన మహాసభలో నూతనంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.