శక్తిపీఠం నిర్మాణానికి విరాళం అందజేత
శివ్వంపేట జూలై జనంసాక్షి :
మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం నిర్మాణానికి, శివ్వంపేట గ్రామ పురోహితులు శాస్త్రుల పురుషోత్తమ శర్మ 51వేల రూపాయల విరాళాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం బగలాముఖి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా బగలాముఖి ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ బగలాముఖి శక్తిపీఠం నిర్మాణానికి అడగకున్నా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారికి తోచినంత విరాళాన్ని అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అమ్మవారి దయతో శక్తిపీఠం నిర్మాణానికి విరాళాలను అందిస్తూ, వస్తు రూపకంగా సహయ సహకారాలను అందిస్తున్న దాతలందరికీ బగలాముఖి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలన్నారు.
మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం నిర్మాణానికి, శివ్వంపేట గ్రామ పురోహితులు శాస్త్రుల పురుషోత్తమ శర్మ 51వేల రూపాయల విరాళాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం బగలాముఖి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా బగలాముఖి ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ బగలాముఖి శక్తిపీఠం నిర్మాణానికి అడగకున్నా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారికి తోచినంత విరాళాన్ని అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అమ్మవారి దయతో శక్తిపీఠం నిర్మాణానికి విరాళాలను అందిస్తూ, వస్తు రూపకంగా సహయ సహకారాలను అందిస్తున్న దాతలందరికీ బగలాముఖి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలన్నారు.

Attachments area