శరవేగంగా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌27(జ‌నం సాక్షి):ఇండ్లు లేని పేదలకు నయాపైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఉచితంగా కట్టించి ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఐటీడీఏ ఇంజినీరింగ్‌ అధికారులు నిత్యం పనులను పరిశీలిస్తూ గుత్తేదారులతో నాణ్యమైన మెటీరియల్‌ను తెప్పించి నిర్మాణాలను చేపడుతున్నారు. ఎమ్మెల్యే ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కల నెరవేరస్తామని హావిూఇచ్చారు. ఒక్కో ఇంటికి రూ.5.4 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసి ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. మౌళిక వసతుల కోసం మరో లక్ష.25లక్షలను ఖర్చు చేసి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ సదుపాయాలు కల్పించనున్నారు.లబ్ధిదారునికి నయాపైసా ఖర్చు లేకుండా ఇండ్లు కట్టించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పకడ్బందీగా నిర్మిస్తున్నాం. ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని విరించారు.