శాంతినగర్ లో 2004-05 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 9
(జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీ లోని శాంతినగర్ లో ని జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో యస్ యస్ సి 2004-05 బ్యాచ్ వారు 17 సంవత్సరాల తరువాత ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరుపుకున్నారు. పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకొని,విద్య బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం జరిగింది. గురువులతో కలసి గ్రూప్ ఫోటో దిగడం జరిగింది.ఈ సమావేశం లో ఎవరెవరు ఎక్కడెక్కడ స్థిరపడినరో వారు స్వయంగా పరిచయం చేసుకున్నారు.ఈ బ్యాచ్ లో వారు చనిపోయిన రాజశేఖర్ కుటుంబానికి 50 వేల రూపాయలు,లక్ష్మీ కాంత రెడ్డి కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇదే బ్యాచ్ కు చెందిన న్యాయవాది సురేష్ రాజశేఖర్,లక్ష్మీకాంత రెడ్డి ఒక్కో కుటంబానికి 10 వేల రూపాయలు అందించారు.ఈ సమ్మేళనం లో హాజరు అయిన విద్యార్థిని ,విద్యార్థులు అంతా గత స్మృతలను నెమరువేసుకున్నారు. హైదరాబాద్,కర్నూల్ ,నందికొట్కూరు లాంటి ప్రాంతాలలో స్థిరపడినవారు సుమారు 100 మంది ,విద్యార్థిని, విద్యార్థులు దాకా హాజరు అయినారు.