శివాంజనేయ ఆలయంలో దుర్గామాత పూజ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని 40వ డివిజన్ ఉరుసు బొడ్రాయి వద్ద గల శివాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం దుర్గామాత పూజ ఘనంగా నిర్వహించారు అర్చకులు వెలిద సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి  మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు దుర్గామాత మాల ధారణ చేసిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు