శ్రీరంగాపూర్ మండలకేంద్రంలో పారిశుద్ధ్య పనులు

 

శ్రీరంగాపురం: జులై  (జనంసాక్షి) :
వర్షకాల నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు మండలకేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం అధికారులు పట్టణంలో నీరు ఆగి ఉన్న ప్రాంతాల్లో  అయిల్ బాల్స్ వేశారు. బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వినీల రాణి, ఎంపీవో  రాజు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.