శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో అన్నదానం

జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్ కల్ మండలం లోని మల్గి గ్రామంలో శ్రావణ మాసం అమావాస్య ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్ధారెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు ఆలయ కమిటీ సభ్యులుభీమన్న విట్టల్ వైద్యనాథ్ జైపాల్ రెడ్డి మారుతిశాంతి కుమార్ మహేష్ సాయినాథ్ సందీప్ కార్తీక్ వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.