షాడో గ్రూప్ గా ఏర్పడి ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు

వల్లూరు మధుసూదన రావు అలియాస్ మధు బాబు షాడో పాత్ర సృష్టి కర్త. ఈ పాత్ర ద్వారా ఎన్నో డిటెక్టివ్ నవలలు, ఇతర నవలలు రాసారు. ఈ సందర్భంగా వారి అభిమానులు షాడో గ్రూప్ గా ఏర్పడి ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.  ఇట్టి సభ్యులు  ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో విహారయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ విహార యాత్రలో గ్రూప్ అడ్మిన్ సయ్యద్ గౌస్ రబ్బానీ, అల్లోజు కిషన్, వెగ్గళం శ్రీనివాస్, హనుమంతరావు,మారం కృష్ణయ్య,కిరణ్, రహమతుల్లా, రామకృష్ణ,ఓబుల్ రెడ్డి,నాసర్ వలి ,ఏ.శ్రీధర్,నరేష్, చింతకాయల రామ్,సీతా అన్నపూర్ణ, పర్వతం శివ పార్వతీ, అన్నా అమర్తల,గేర జ్యోతి,లక్ష్మి, దివ్య తదితరులు పాల్గొన్నారు.