షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం
విచారణకు ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12( (జనంసాక్షి): షార్ట్సర్కూట్ వల్లే ¬టల్ అర్పిత్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం సంభవించినట్లే నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. మంటల కారణంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరాడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సదరు అధికారి తెలిపారు. అక్టోబరు 2005న ¬టల్కు లైసెన్స్ ఇవ్వగా.. గతేడాది దాని గడువును పొడిగించారు. ‘ప్రమాద స్థలం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఉదయం 3.30గంటల సమయంలో రెండో అంతస్తులో షార్ట్సర్కూట్ జరిగింది. దీంతో మంటలు చెలరేగి ¬టల్ మొత్తం వ్యాపించాయి’ అని ఎన్డీఎంసీ అధికారి తెలిపారు. ఘటనా స్థలాన్ని దిల్లీ ¬ంశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పరిశీలించారు. దీనిపై న్యాయపరమైన విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన వెల్లడించారు. ‘అర్పిత్ ¬టల్లో నాలుగు అంతస్తులు నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఆరు అంతస్తులు నిర్మించారు. టెర్రస్ విూద టేబుల్స్, కుర్చీలు వేసి దాన్ని మరో గదిగా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలని అధికారులను ఆదేశించాను. ఈ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారు’ అని మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలను రద్దు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. కరోబ్ బాగ్ ప్రాంతంలోని అర్పిత్ ¬టల్లో సంభవించిన అగ్నిప్రమాదానికి విచార సూచికంగా నాలుగో వార్షికోత్సవ సంబరాలను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిహారం ప్రకటించిన కేజీవ్రాల్..దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులను కలిసి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం..
¬టల్లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.