సంకల్ప్ కిరణ్ పురస్కార్ అందుకోనున్న అరుణా రాయ్

ప్రదానం చేయనున్న మంత్రి హరీష్ రావు
ఖైరతాబాద్ : నవంబర్ 25 (జనం సాక్షి) ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. మానవతావాది, దార్శనికుడు లయన్ డాక్టర్ వై.కిరణ్ జన్మదినం సందర్భంగా ‘సంకల్ప్ దివస్  నవంబర్ 28 న పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో జరిగే ఒక అద్భుతమైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి తెలగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా సంకల్ప్ సంజీవని పురస్కర్ ఆరుగురు గ్రహీతలు, దివ్యాంగులైన పిల్లలు వ్యక్తులకు గొప్ప సేవ చేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి సంకల్ప్ సిద్ధి పురస్కారాలు అందిస్తారు. రక్షణ మంత్రిత్వశాఖలో మాజీ డిప్యూటీ డైరెక్టర్, సి.ఎస్.బి. ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రెండుసార్లు సివిల్స్ ర్యాంకర్ సామాజిక కార్యకర్త మోటివేటర్ అయిన బాలలత రెండుసార్లు జాతీయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎం.శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి సంకల్ప విశిష్ఠ అతిథులుగా హాజరవుతారు. పురస్కారం అందుకుంటున్న సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ అరుణా రాయ్ మాట్లాడుతూ… సంకల్ప్ కిరణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. తన పుట్టిన రోజును విభిన్నంగా చేసుకుంటున్న లయన్ డాక్టర్ వై.కిరణ్ ను అభినందించారు. లయన్ డాక్టర్ వై.కిరోన్, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సుచిర్ ఇండియా మాట్లాడుతూ  సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే వ్యక్తులు మనలో చాలా మంది ఉన్నారని, ఈ సంకల్ప్ అవార్డులు వారి గొప్ప పనిని గుర్తించి వారిని మరింత చేయడానికి ప్రోత్సహించే ప్రయత్నం అన్నారు.