సంక్షేమంలో ముందున్నాం

ఖమ్మం,జూన్‌7(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళలకు వెయ్యి జీవనభృతి పథకాన్ని ప్రారంబించాక ప్రజల్లో మంచి స్పందన వస్తోందిన బుధవారం నాడిక్కడ అన్నారు. సిఎం కెసిఆర్‌ మూడేళ్ల కాలంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ వెనకడుగు వేయదని అర్హులైన ప్రతి ఒంటరి మహిళలకు జీవనభృతి కల్పించాలని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.