సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌: రేణుకాచౌదరి

ఖమ్మం,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కురుకపోయిందని మాజీ ఎంపి రేణుకా చౌదరి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్‌ నాయకులు రేణుక చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈసమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు దిపక్‌ చౌదరి. వడెబోయిన నరిసింహరావు.ఎడవలి కృష్ణ. పొట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ ప్రచారరా/ాభాటం తప్ప ఫలితం శూన్యమని అన్నారు. ఎన్నికలు సవిూపిస్తున్నందున ఓట్లు దండుకునేందుకే రైతుబంధు, ఉద్యోగాల ఆశ చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల నుంచి రైతుబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతుబంధును పేద కౌలు రైతులకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఈ పథకం దొరలు, విదేశాల్లో ఉన్న భూస్వాములకే ఉపయోగపడుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదనల కంటే రెట్టింపు నిధులు పెంచారని విమర్శించారు.