సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. గురువారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్, మల్కాజిగిరి మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో దరఖాస్తు చేసుకున్న 148 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సబితా కిషోర్,మీనా ఉపేందర్ రెడ్డి,సునీత యాదవ్,నాయకులు ఉపేందర్ రెడ్డి,సంతోష్ రామదాస్,మోహన్ రెడ్డి,బాబు,కన్నా, సూరి,బాలకృష్ణ,భాగ్యనందరావు, సత్తయ్య,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.