సంగమేశ్వర ఆలయంలో పూజలు చేసిన సర్పంచ్
జహీరాబాద్ జులై 29( జనంసాక్షి) ఝరాసంగం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకొని గుబ్బడి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుండి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మఠం లక్ష్మీబాయి కుటుంబంతో కలిసి సంగమేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్ స్వామి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.