సంజయ్దత్ పున: సమీక్ష పిటీషన్ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
ఢిల్లీ : బాలీవుడ్ నటుడు సంజయ్దత్ పెట్టుకున్న పున:సమీక్ష పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ విచారణార్హం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. సంజయ్తో పాటు మరో ఆరుగురు నిందితుల పిటిషన్లను సైతం కోర్టు తోసిపుచ్చింది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో కోర్టు సంజయ్కు జైలు శిక్ష విధించిన సంగతి విదితమే. ఈ కేసులో సంజయ్ ఇంకా 42 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంజయ్దత్ మే 15 లోగా లొంగిపోనున్నాడు.