సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 15 లోగా కోర్టులో లొంగిపోవాలని సంజయ్‌ను కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురి రివ్యూ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. సంజయ్‌దత్‌ దాఖలు చేసిన రివ్యూపిటిషన్‌ విచారణార్హం కాదని కోర్టు పేర్కొంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.