సంతోషిమాత ఆలయములో ఘనంగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం
జహీరాబాద్ ఆగస్టు 8 జనం సాక్షి జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో కాలనీలో సంతోషిమాత ఆలయంలో ఘనంగా విగ్రహ శికర ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ మందిరం నుండి హౌసింగ్ బోర్డ్ సంతోషిమాత దేవాలయం వరకు మహిళలు ర్యాలీగా భక్తితో పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు