సంస్కృతం నేటి సమాజానికి అణువైన భాష..బి.వెంకట్

  నిర్మల్ బ్యూరో, ఆగస్ట్12,జనంసాక్షి,,,   సంస్కృతం సహజమైన భాష యని సంస్కృతభాషా పరిరక్షణ సమితి రాష్ట్ర సమన్వయ కార్యదర్శి, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు బి వెంకట్ అన్నారు .జాతీయ సంస్కృత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో సమితి ఆధ్వర్యములో నిర్వహించారు. సంస్కృతం నేటి సమాజానికి అనువైనభాషయని అన్నారు. విశ్వ భాషలకు ఆధారమై గొప్పగా సంస్కృతం విరాజిల్లుతోందని అన్నారు. ప్రాచీన భాషయగు దేవనాగరి లిపిలో వేదాలు ,రామాయణం, మహాభారతం ,పురాణాలు, శాస్త్రాలు ,కావ్యాలు, రచింపబడినాయని అన్నారు. అమెరికాలోని నాసా సంస్థ సంస్కృత కావ్యాలపై చరిత్రపై అధ్యయనము చేసి సంస్కృతం అన్ని భాషల కంటే గొప్పభాషయని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు .అమరవాణిగా పిలువబడుచుకున్న సంస్కృతం పావన నది ప్రవాహం వంటిదని ,సామాజికమైన భాషగా సంస్కృతం కీర్తిని పొందిందని అన్నారు .ఈ సందర్బంగా మానవీయ విలువలను పెంచే సుభాషితాలను ఇంటర్ బాలికలు రాగ యుక్తన్గా  ఆలపించారు, ప్రిన్సిపాల్ *నీరడి గంగాశంకర్ ఉపన్యాసకులు ,విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు .