సమస్యల పరిష్కారానికే పాదయాత్ర.

వినాయక నగర్ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.గురువారం డివిజన్ పరిధిలోని జెకె కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, శానిటేషన్,వీధి దీపాలు,రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని,ఓపెన్ కాలువల ఎత్తు పెంచాలని, మంచినీరు, డ్రైనేజీ తదితర సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు,కాలనీవాసులు పాల్గొన్నారు