సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వండి
కార్యదర్శి ని కోరిన భాజపా నాయకులు
ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 29 ,(జనం సాక్షి ) బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 13 ,14 ,15 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులు ,వైకుంఠ ధామాలు నిర్మించుటకు వచ్చిన నిధులు ,అంటూ దోభీ ఘాట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి , 2022 జూన్ 30 నాటికి కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు , మంజూరు చేసిన సంఖ్య , వివరాలు , అలాగే 2014 -15 సంవత్సరం నుండి 2022 జూన్ వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చిన నిధుల వివరాలు ఇవ్వవలసిందిగా కార్యదర్శి మనోజ్ కుమార్ కు సమాచార హక్కు చట్టం కింద కోరారు.బూత్ అధ్యక్షులు బాసెట్టి శేఖర్ , గాండ్ల రాజు ,నీరటి రవి , బాసెట్టి రమేష్ , చల్లగరిగే అంజయ్య ,దాసరి రాజేంధర్ ,వంగ శ్రీనివాస్ ,జిపి సిబ్బంది నీరటి రతన్ ,శేర గంగాధర్ పాల్గొన్నారు.